ATP: గుత్తి మండలం టీ.కొత్తపల్లి గ్రామ సమీపంలోని 63 హైవేపై శుక్రవారం తెల్లవారుజామున బైకు, బొలెరో వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈసురాళ్లపల్లి గ్రామానికి చెందిన బెస్త రంగస్వామి, బెస్త పవన్ అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా: వీబీజీరామ్జీ యాక్ట్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎంపీడీవో ఇమ్రాన్ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీబీజీరామ్జీ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన సేవలు అందించడం అని అన్నారు. ఈ చట్టం ద్వారా గ్రామస్థాయిలో అమలయ్యే పథకాల పర్యవేక్షణ, ప్రజల భాగస్వామ్యం సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
VSP: యూసీసీ క్రికెట్ పోటీల్లో భాగంగా శుక్రవారం ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ స్టేడియంలో గెలాక్సీ సీసీ జట్టు, వైజాగ్ కోల్ట్స్ జట్టు మధ్య ఫైనల్ పోరు జరుగుతుందని యూసీసీ అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, వెంకటేష్ సంయుక్తంగా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి జిల్లా వాసులు మ్యాచ్ను తిలకించేందుకు తరలిరావాలని కోరారు.
W.G: పెదమైనవానిలంకలో శనివారం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోట్లు, వలల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ పంపిణీ ఏర్పాట్లను జేసీ టి. రాహుల్ కుమార్ రెడ్డి గురువారం పర్యవేక్షించారు. సుమారు 100 బోట్లను లబ్ధిదారులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమం విజయవంతం చేసేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
TTD: ఛైర్మన్ బీ.ఆర్.నాయుడును ఈవో ముద్దాడ రవిచంద్ర గురువారం సాయంత్రం తిరుమలలోని ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రను శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఛైర్మన్తో పాటు బోర్డు సభ్యులు నరేష్ కుమార్ ఉన్నారు.
W.G: గొంది గ్రామంలో జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చల్లపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. జనసేన సభ్యత్వం తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే జానకి రామ్, పాలిశెట్టి శ్రీనివాస్, బొమ్మిడి సునీల్ పాల్గొన్నారు.
E.G: అనపర్తి నియోజకవర్గంలో బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం నిమిత్తం రూ. 10.04 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యాలయం గురువారం వెల్లడించింది. అనపర్తి మండలానికి రూ. 3 కోట్లు, బిక్కవోలుకు రూ. 4.52 కోట్లు, రంగంపేట మండలానికి రూ. 2.52 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యే చొరవతో రహదారులకు మహర్దశ పట్టిందని కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
NTR: ఉమ్మడి కృష్ణాజిల్లా లెజిస్లేటివ్ క్రీడా పోటీల్లో నేతలు తమ క్రీడా ప్రతిభను చాటారు. జావెలిన్ త్రో, షాట్పుట్ విభాగాల్లో MLAలు శ్రీరామ్ తాతయ్య, గద్దె రామ్మోహన్ విజేతలుగా నిలిచారు. క్యారమ్స్లో వర్ల కుమార్ రాజా, గద్దె రామ్మోహన్ గెలుపొందగా, బ్యాడ్మింటన్లో కాగిత కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ తాతయ్య, వర్ల కుమార్ రాజా విజేతలుగా నిలిచారు.
KRNL: కర్నూలులోని సీ. క్యాంపు రైతుబజారుకు నేడు సెలవు ప్రకటించినట్లు ఎస్టేటు అధికారి కళ్యాణి, హార్టీకల్చర్ కన్సల్టెంటు శివకుమార్ తెలిపారు. రైతుబజారుకు వినియోగదారులు, రైతుల తాకిడి ఎక్కువగా ఉంటున్నందున శ్రుభతపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా తెలిపారు. కేవలం రైతుబజారులో క్లీనింగ్ పనులు పకడ్బందీగా చేపట్టేందుకే ఒక్క రోజు సెలవు ప్రకటిం చినట్లు పేర్కొన్నారు.
TPT: తిరుచానూరు సమీపంలోని మహిళా ప్రాంగణంలో నాని కేర్ సర్వీసెస్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఫర్జానా ప్రకటించారు. పదో తరగతి పాస్ అయిన, 25-50 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళలు అర్హులు. ఈ కోర్సు వ్యవధి 6 నెలలు కాగా, శిక్షణ పూర్తయ్యాక అభ్యర్థులకు మహిళా ప్రాంగణంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
KRNL: RU పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్న ఫస్ట్ సెమిస్టర్ పరీక్షకు గురువారం 85 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 99 మంది విద్యార్థుల్లో 84 మం ది హాజరయ్యారు. కర్నూలు రవీంద్ర డిగ్రీ కాలేజీలో ఒక్కరు డీబార్ అయ్యారు. అలాగే బీటెక్ పరీక్షలకు 99 శాతం, లా పరీక్షకు 92 శాతం మంది విద్యార్థులు హాజరయినట్లు అధికారులు తెలిపారు.
KRNL: RU పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో నిర్వహిస్తున్న ఫస్ట్ సెమిస్టర్ పరీక్షకు గురువారం 85 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 99 మంది విద్యార్థుల్లో 84 మం ది హాజరయ్యారు. కర్నూలు రవీంద్ర డిగ్రీ కాలేజీలో ఒక్కరు డీబార్ అయ్యారు. అలాగే బీటెక్ పరీక్షలకు 99 శాతం, లా పరీక్షకు 92 శాతం మంది విద్యార్థులు హాజరయినట్లు అధికారులు తెలిపారు.
కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడమే లక్ష్యంగా పోలీసులు గురువారం ప్రత్యేక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్.సి (RC), పొల్యూషన్, ఇన్షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్లు విధించారు.
PLD: ఈపూరు మండలం బొగ్గరం గ్రామానికి చెందిన పిట్టల నాగమణి (24), ఆమె కుమార్తె త్రివేణి అదృశ్యమయ్యారని ఎస్సై వేణుగోపాల్ తెలిపారు. ఈ నెల 24న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో, నాగమణి తల్లి వెంకటరమణ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. భర్త శ్రీనుతో ఉన్న మనస్పర్ధలే వీరి అదృశ్యానికి కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.