PPM: పాలకొండ పంచాయతీ రాజ్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్.రాధారాణి గురువారం కలెక్టర్ డా, ప్రభాకర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కలెక్టర్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో కలెక్టర్ను కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లాలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ పనులపై దృష్టి సారించాలన్నారు.
కృష్ణ: ఉయ్యూరు AGSGS కళాశాలలో శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ శివనాథ్ వెల్లడించారు. 10వ తరగతి నుంచి పీజీ వరకు పూర్తి చేసిన అభ్యర్థులు, బీఎస్సీ కెమిస్ట్రీ, ఫార్మసీ విద్యార్థులు, అలాగే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు పాల్గొనవచ్చన్నారు. అర్హత గల యువత అవసరమైన ధ్రువపత్రాలతో కళాశాల ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు.
E.G: ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని గోపాలపురం ఎస్సై పి.శివగణేశ్ సూచించారు. గురువారం గోపాలపురం చెక్ పోస్ట్ సెంటర్లో వాహనదారులకు అవగాహన కల్పించారు. రహదారిపై ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో తెలియదని, ప్రాణాలు కోల్పోతే ఆయా కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హెల్మెట్ ధరించాలని కోరారు.
TPT: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఫిబ్రవరి 28న జిల్లాకు రానున్నారు. మార్చి 1న దామినేడు వద్ద నూతన జిల్లా కోర్టు భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించనున్నారు. పర్యటనకు సంబంధించిన భద్రత, పారిశుద్ధ్యం, హెలిప్యాడ్, పార్కింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు.
NDL: జిల్లాలో వైద్య శాఖ సేవలపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరగాలంటే సేవల నాణ్యతను మెరుగుపరచాలని కలెక్టర్ రాజకుమారి వైద్యాధికారులకు గురువారం సూచించారు. కలెక్టరేట్ నుంచి జూమ్ ద్వారా మెడికల్ ఆఫీసర్లు, సీహెచ్సీ వైద్యులు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతి రోగికి సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలనిన్నారు.
సత్యసాయి: శాసనమండలిలో శ్రీవారి లడ్డూ అంశంపై చర్చకు కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేస్తోందని ఉషశ్రీచరణ్ విమర్శించారు. పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానాలు ఇస్తున్నప్పటికీ చర్చకు ముందుకు రావడం లేదన్నారు. లడ్డూ కల్తీ వ్యవహారంలో నిజాలు బయటపడతాయనే భయంతోనే ప్రభుత్వం తప్పించుకుంటోందని ఆరోపించారు. చర్చకు ధైర్యంగా రావాలని డిమాండ్ చేశారు.
ATP: జిల్లా రైతుల సంక్షేమం కోసం పశువుల షెడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి ప్లాంట్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ బల్లా పల్లవి కోరారు. ఈ మేరకు పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీనారాయణను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. స్థానిక అవసరాలను గుర్తించి తగిన సహకారం అందించాలని ఆయనను కోరగా సానుకూలంగా స్పందించారు.
E.G: ఒడిశాలోని భార్గడ్ రోడ్లో ఈనెల 11 నుంచి 14 వరకు జరిగిన నేషనల్ వీల్ చైర్ క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్గా నిలిచింది. రన్నరప్ కప్తో రాజమండ్రి వచ్చిన క్రీడాకారులు గురువారం రూరల్ తహశీల్దార్ శ్రీనివాసరావు, ధవలేశ్వరం సీఐ టి.గణేశ్, శాప్ ఏఎస్వో శేషగిరిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను అధికారులు అభినందించారు.
GNTR: లింగాయపాలెంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. D12 సెక్షన్ పరిధిలో ‘RDSS’ పథకం కింద పాత స్తంభాలను మార్చే పనులను చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసి, సరఫరాను పునరుద్ధరిస్తామని విద్యుత్ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
PLD: మంత్రి నారా లోకేశ్కు పల్నాడు ‘యువగళం’ చిత్రపటాన్ని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బహూకరించారు. గురువారం జరిగిన ఈ ఆత్మీయ భేటీలో యువగళం నాటి విశేషాలు, లోకేశ్ తొలిసారి ‘రెడ్ బుక్’ ప్రస్తావన తెచ్చిన అంశంపై వారు చర్చించుకున్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని అప్పట్లో లోకేశ్ చేసిన ప్రకటనను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
KKD: జగ్గంపేట టీచర్స్ కాలనీలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. ఒడిబోయిన మణికంఠ మద్యం మత్తులో భార్య సాయితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన 11 నెలల కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు. అనంతరం పాపతో కలిసి పోలవరంలో కాలువలో దూకగా చిన్నారి మరణించింది. మణికంఠ ప్రాణాలతో బయటపడ్డాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.
TPT: తల్లంపాడు నుంచి సూళ్లూరుపేటకు వచ్చే ప్రధాన వాటర్ పైపైలైన్ పగిలిపోయింది. ఈ క్రమంలో సూళ్లూరుపేటలో శనివారం నీటి సరఫరా నిలిచిపోనుంది. బజార్ వీధి నుంచి పోస్ట్ ఆఫీస్ మీదుగా బొగ్గుల కాలనీ వరకు నీటి సరఫరా ఉండదు. పనులు పూర్తయ్యే వరకు ప్రజలు నీటిని మితంగా వినియోగించుకోవాలని కమిషనర్ చిన్నయ్య కోరారు.
NDL: కొలిమిగుండ్ల మండలంలోని అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన జూటూరు పుష్పావతి(40) కుటుంబ వివాదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ రమేష్ బాబు తెలిపారు. బుధవారం రాత్రి 11 గంటలకు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా, కుటుంబ సభ్యులు అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందినట్లు సీఐ వెల్లడించారు.
AKP: మునగపాక మండలం గణపర్తి జడ్పీ హైస్కూల్లో ఏపీ ఎన్.డీ.ఆర్.ఎఫ్. 16వ బెటాలియన్ ఆధ్వర్యంలో విపత్తుల నుంచి రక్షణ కోసం గురువారం మాక్ డ్రిల్ నిర్వహించారు. వరదలు, అగ్నిప్రమాదాలు, అపార్ట్మెంట్స్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఏ విధంగా బయటపడాలో విద్యార్థులకు బెటాలియన్ ఆర్ఎస్ఐ వైకుంఠ రావు సూచించారు.
GNTR: మాజీ మంత్రి అంబటి రాంబాబును గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురువారం గుంటూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అంబటి నివాసంపై జరిగిన దాడుల అంశాన్ని వీరిద్దరూ చర్చించారు. పల్నాడు జిల్లాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలపై వరుస దాడులు జరుగుతున్నాయని,అంబటి రాంబాబును అరెస్ట్ చేయడం బాధాకరమని కాసు మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు.