E.G: ఒడిశాలోని భార్గడ్ రోడ్లో ఈనెల 11 నుంచి 14 వరకు జరిగిన నేషనల్ వీల్ చైర్ క్రికెట్లో ఆంధ్రప్రదేశ్ జట్టు రన్నరప్గా నిలిచింది. రన్నరప్ కప్తో రాజమండ్రి వచ్చిన క్రీడాకారులు గురువారం రూరల్ తహశీల్దార్ శ్రీనివాసరావు, ధవలేశ్వరం సీఐ టి.గణేశ్, శాప్ ఏఎస్వో శేషగిరిలను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను అధికారులు అభినందించారు.