సత్యసాయి: కదిరి పట్టణంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామిని జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఇవాళ దర్శించుకున్నారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు అందజేశారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి దర్శనం చేసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
KDP: ఎర్రగుంట్ల- కడప రోడ్డులోని జువారి రైల్వే బ్రిడ్జి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు బైక్పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొన్నట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమించడంతో 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీకాకుళం: వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా మోటార్ వాహన చట్ట నిబంధనలను పాటించాలని శక్తి టీం హెచ్సీలు ఎం. గిరిధర్, కే. గణేష్ తెలిపారు. ఆదివారం కోటబొమ్మాలి మండలం మంచాల పేటలో స్థానికులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ విధిగా వాడాలని సూచించారు. ప్రమాదాలు జరిగేటప్పుడు 1033 టోల్ ఫ్రీ నెంబర్ను వినియోగించాలన్నారు.
ATP: గార్లదిన్నె మండలం బూదేడు గ్రామానికి చెందిన జొన్నే సూర్యనారాయణ కుమార్తె స్నేహలత వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదివారం రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
కృష్ణా: గన్నవరంలో జనసేన ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఆదివారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతంగా సమర్థవంతంగా చేపట్టాలని నేతలకు సూచించారు. గ్రామ వార్డు స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద నిర్మించనున్న 16 కోర్టు భవనాల సముదాయానికి భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్లొన్నారు.
అన్నమయ్య: రామసముద్రం మండలం నరసాపురం గ్రామానికి చెందిన ప్రభాకర్ డేరంగుల అనే వ్యక్తి నూతన దర్శకుడుగా తెలుగు, తమిళ్ భాషలో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ తిరుపతిలోని హోటల్ బ్లెస్స్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ ఈవెంట్కు తిరుమల దేవస్థానంకు పలువురు ప్రముఖులు విచ్చేశారు.
KRNL: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కార్యకలాపాల కారణాల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాచిగూడ – కర్నూలు సిటీ (17435), కాచిగూడ-రాయచూరు (67787) రైళ్లతో పాటు, కర్నూలు సిటీ-కాచిగూడ (17436) రైలును మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు.. 8 రోజులు రద్దు చేశారు. ప్రయాణికులు మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని రైల్వే శాఖ కోరింది.
ELR: ఏపీ మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రకాష్ నాయుడు ఆదివారం ఏలూరులో మాంసపు దుకాణాలపై తనిఖీలు చేపట్టారు. పాడైపోయిన చికెన్ విక్రయిస్తున్నట్లు గుర్తించి యజమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు కల్తీ మాంసం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచిస్తూ, నిబంధనలు పాటించని షాపులకు జరిమానా విధించారు. నగరవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతుండటంతో మాంసం వ్యాపారుల్లో కలకలం రేపింది.
విశాఖ: ICAR-CMFRI శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన 3×3 మీటర్ల HDPE తేలియాడే తెప్పలను విశాఖపట్నం తీరంలో మత్స్యకారులు వినియోగంలోకి తెచ్చారు. ఈ తెప్పలు సముద్ర అలలను తట్టుకుంటూ తక్కువ పెట్టుబడితో చేపలు, సముద్ర నాచు సాగుకు అనుకూలంగా ఉంటాయి. దీంతో మత్స్యకారుల ఆదాయం పెరిగి నీలి విప్లవానికి ఊతం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
NTR: విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఆదివారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ బ్యారేజ్పై నుంచి కృష్ణా నదిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలిని మహాలక్ష్మి (45)గా పోలీసులు గుర్తించారు. ఆమె ఏ ప్రాంతానికి చెందినవారనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
కడప: జిల్లాలో ఎర్రగుంట్ల-ముద్దనూరు రోడ్డులో సరైన పత్రాలు లేకుండా కారులో భారీగా నగదు తరలిస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారిని ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 2.52 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు, దానిని కడప ఖజానా కార్యాలయానికి అప్పగించారు. ఈ నగదుకు సంబంధించిన బిల్లులపై ఐటీ శాఖ విచారణ చేపట్టినట్లు ఎర్రగుంట్ల పోలీసులు తెలిపారు.
CTR: పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత అని శానిటరీ ఇన్స్పెక్టర్ ముని వెంకటప్ప పేర్కొన్నారు. ఆదివారం పుంగనూరు పట్టణంలో వివిధ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి తడి చెత్త-పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించారు. పట్టణ పరిసరాల పరిశుభ్రతే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు.
KDP: జమ్మలమడుగు శ్రీ పెద్దమ్మ తల్లి దేవర సందర్భంగా ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. 17 ఏళ్ల తర్వాత జరుగుతున్న జాతర జమ్మలమడుగు ప్రజలకు ఒక పండగ వాతావరణంలా ఉందని, ఆ అమ్మవారి దీవెనలు ఎప్పుడు ప్రజలపై ఉండాలని ఆయన కోరారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రజలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పిస్తున్నారు.
W.G: జిల్లా వ్యాప్తంగా మార్చి 1 నుండి 8వ తేదీ వరకు మహిళా వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం ఏలూరు నగరంలో భారీ అవగాహన ర్యాలీని నిర్వహించారు. పోలీస్ సంక్షేమ భవనం నుంచి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ చేశారు. ర్యాలీని ఉద్దేశించి అదనపు ఎస్పీ సూర్య చంద్రరావు మాట్లాడుతూ.. సమాన హక్కులు సమాన గౌరవం, పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలన్నారు.