• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

‘ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలి’

జీడిపిక్కలకు ప్రభుత్వం రూ. 200 మద్దతు ధర ప్రకటించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్ రాయవరం మండలం వేమగిరిలో ఉపాధి కూలీలతో ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వమే జీడిపిక్కలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్న ప్రభుత్వం జీడిపిక్కలకు ఎందుకు ప్రకటించడం లేదన్నారు.

March 2, 2026 / 04:00 PM IST

రిజ్వాన్ నగర్‌లో అభివృద్ధి పనులకు భూమి పూజ

కడప నగర శివారులోని 27వ డివిజన్ రిజ్వాన్ నగర్‌లో సీసీ రోడ్డు, డ్రైనేజ్, వాటర్ పైప్‌లైన్ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధుల ద్వారా కడప మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.1.12 కోట్లు విడుదల కాగా, ఎంపీ లాడ్స్ కింద రూ.6 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ పనులు, రూ.4 లక్షలతో పైప్‌లైన్ పనులను ప్రారంభించారు.

March 2, 2026 / 04:00 PM IST

అన్నదాతలకు రాజముద్రతో పాసుపుస్తకాలు

TPT: కేవీబీ పురం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 107 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. వ్యక్తుల ఫోటోలు లేకుండా ప్రభుత్వ రాజముద్రతో మాత్రమే పాసుపుస్తకాలు ముద్రించి అందిస్తున్నామని తెలిపారు. సూర్యనారాయణపురం (70 మంది), బక్కపోతుల కుంట (37 మంది) రైతులు లబ్ధి పొందారు.

March 2, 2026 / 03:56 PM IST

కారు, లారీ ఢీ.. ఎంపీడీవోకు తప్పిన ప్రమాదం

నెల్లూరు రూరల్ వడ్డిపాలెం వద్ద సోమవారం తోటపల్లి గూడూరు ఎంపీడీవో వెంకటేశ్వర్ రావు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీడీవో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు మాత్రం తీవ్రంగా దెబ్బతింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

March 2, 2026 / 03:50 PM IST

‘ఎస్పీ కార్యాలయానికి 27 పిర్యాదులు’

కోనసీమ: అమలాపురం ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకి 27 పిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఎస్పీ రాహుల్ మీనాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. బాధితుల ఫిర్యాదుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, త్వరితగతిన పిర్యాదులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

March 2, 2026 / 03:50 PM IST

రోడ్డు ప్రమాదం.. ఏడుగురికి తీవ్ర గాయాలు

KDP: బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామ సమీపంలో సోమవారం బొలెరో జీప్, ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఏడుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని 108 వాహనం ద్వారా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

March 2, 2026 / 03:40 PM IST

ఛత్రపతి శివాజీ విగ్రహా ఏర్పాటుకు ఎమ్మెల్యే కు వినతి

KRNL: నందవరం గ్రామ పంచాయతీ ఆవరణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ ప్రజలు, యువకులు సోమవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేలా శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.

March 2, 2026 / 03:40 PM IST

ఎస్పీ కార్యాలయంలో PGRSకు 45 ఫిర్యాదులు

ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం PGRS కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల వద్ద ఎస్పీ ప్రతాప్ కిషోర్ 45 ఫిర్యాదులను స్వీకరించారు. ఎక్కువగా మోసపూరిత లావాదేవీలు, భూ తగాదాలు వచ్చినట్లు తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేయవలసిందిగా అధికారులకు సూచించారు.

March 2, 2026 / 03:38 PM IST

PGRS ఫిర్యాదులపై తక్షణ చర్యలు: ఎస్పీ

అన్నమయ్య: మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ పాల్గొన్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి భూ వివాదాలు, కుటుంబ కలహాలు, సైబర్ నేరాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ కట్టుబడి ఉందని తెలిపారు.

March 2, 2026 / 03:36 PM IST

సింగరకొండ రథోత్సవానికి 650 మంది పోలీసుల భద్రత

ప్రకాశం: సింగరకొండలోని శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి 71వ వార్షికోత్సవం, రథోత్సవ బందోబస్తును ప్రకాశం జిల్లా SP హర్షవర్ధన్ రాజు సోమవారం పరిశీలించారు. ఇవాళ జరగనున్న రథోత్సవానికి ముగ్గురు DSPలు, నలుగురు CIలు, 40 మంది SIలతో కలిపి మొత్తం 650 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆలయ పరిసరాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు.

March 2, 2026 / 03:35 PM IST

అర్జీలు స్వీకరించిన జేసీ

నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

March 2, 2026 / 03:34 PM IST

మందుగుండు తయారీ కేంద్రం సీజ్

AKP: నర్సీపట్నం మండలం వేములపూడి గ్రామంలోని శ్రీ వేమ శివ గణేష్ క్రాకర్స్ తయారీ యూనిట్‌ని సోమవారం రెవిన్యూ అధికారులు సిజ్ చేశారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ప్రమాదం దృష్ట్యా తహసీల్దార్ లోకవరపు రామారావు ఆదేశాలతో మందు గుండు తయారు కేంద్రాన్ని సీజ్ చేసినట్లు వీఆర్వో సత్య నాగ శివ భాస్కర్ తెలిపారు.

March 2, 2026 / 03:31 PM IST

బాల్య వివాహ ముక్త భారత్ రథం ప్రారంభం

కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో బాల్య వివాహాల విముక్తి రథాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, ICDS డైరెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జెండా ఊపి ఇవాళ ప్రారంభించారు. ఈ రథం జిల్లాలోని అన్ని గ్రామాలు, మండలాల్లో పర్యటిస్తూ బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పిస్తుందని వారు తెలిపారు. ఆడపిల్లలను చదువు ద్వారా ప్రయోజకులను చేయాలన్నారు.

March 2, 2026 / 03:31 PM IST

పిఠాపురం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 53 అర్జీలు స్వీకరణ

KKD: పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అధారిటీ (పాడా) కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాడా ఎపీడీ వసంత మాధవి పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజల నుంచి వివిధ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజల వద్ద నుంచి వివిధ అంశాలపై 53 అర్జీలు అందాయన్నారు. ఈ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.

March 2, 2026 / 03:30 PM IST

కొడాలి నానిని ప్రజలు మర్చిపోయారు: ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ టీడీపీ కార్యాలయం ఎమ్మెల్యే రాము సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయనకొడాలి నాని త్వరలో తాను జైలుకు వెళుతున్నానని అర్థమయిందేమోనని, ఏ జైలు అయితే బాగుంటుందో చూసుకోవడానికి గుంటూరుకి వెళ్లారని అన్నారు. కొడాలి నానిని ప్రజలు మర్చిపోయారని, ఆయన గురించి మాట్లాడుకునేది ఏమీ లేదని తెలిపారు.

March 2, 2026 / 03:30 PM IST