నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ప్రారంభమైంది. కలెక్టర్ హిమాన్షు శుక్లా అందుబాటులో లేకపోవడంతో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.