ప్రకాశం: అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బండారు శివకుమారి అనే మహిళ మొక్కజొన్న తోటలోకి గడ్డి కోసం వెళ్లిన క్రమంలో అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు.
GNTR: గుంటూరు నగరపాలక సంస్థ (GMC) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఓప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. నగర వాసులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
NDL: గోసానిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ వడ్డె సురేష్ను డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి శివరాం ఇవాళ పరామర్శించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.
W.G: చంద్రగ్రహణం పురస్కరించుకుని భీమవరం గునుపూడిలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. తిరిగి 4వ తేదీ (బుధవారం) ఉదయం 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వివరించారు.
W.G: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీషీటర్లకు సీఐ నాగరాజు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. వారి ప్రస్తుత జీవన విధానం, వృత్తుల గురించి ఆరా తీశారు. గత నేర ప్రవృత్తిని వీడి, సత్ప్రవర్తనతో బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని ఆయన హితవు పలికారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
W.G: 86 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన భీమవరం టౌన్ హాల్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కుని అభివృద్ధి పథంలో పయనిస్తోందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు. ఆదివారం గొల్లవానితిప్ప రోడ్డులోని టౌన్ హాల్ నూతన ప్రాంగణంలో నిర్వహించిన 86వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. క్లబ్బులు పదిమందికి ఉపయోగపడేలా, సేవా దృక్పథంతో ఉండాలని అన్నారు.
KDP: గాలివీడు మండలంలో పోలీసుల ఆధ్వర్యంలో రెండు ప్రాంతాల్లో సౌరశక్తితో పనిచేసే డ్యూయల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆరవీడు గ్రామంలో దాత మందపాటి రవీంద్ర బాబు, గరుగుపల్లి సచివాలయం వద్ద మోపురి వెంకటరమణ సహకారంతో కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ భద్రత కోసం సహకరించిన దాతలు, ప్రజలకు పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.
NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో ఆదివారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, ఆశ్రమ స్థలదాత పోనక కనకమ్మ విగ్రహానికి పట్టు వస్త్రం, నూలు మాల సమర్పించారు. అనంతరం ఆశ్రమ కమిటీ సభ్యులు దయాకర్ రెడ్డి విద్యార్థులకు ఆశ్రమ స్థల దాత, స్వాతంత్య్ర సమరయోధురాలు పోనక కనకమ్మ జీవిత విశేషాల గురించి వివరించారు.
అన్నమయ్య: మట్లి పెద్దూరులో ఆదివారం నిర్వహించిన గంగమ్మ జాతరకు రాజంపేట నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. పీఏసీ ఛైర్మన్ రాజా నాయుడు ఆహ్వానం మేరకు జాతర కార్యక్రమంలో పాల్గొని భక్తుల ఆదరణను స్వీకరించారు. గంగమ్మ చల్లని చూపులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
KKD: సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 23కి చేరింది. కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న ఇద్దరు ఆదివారం మధ్యాహ్నం మరణించడంతో ఈ సంఖ్య పెరిగింది. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతోంది.
NLR: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) ఆధ్వర్యంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులుకు కలిగిరి మండల లెవెల్ ప్రతిభా పాఠవ పరీక్ష -2026ను స్థానిక జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కలిగిరి నందు ఆదివారం నిర్వహించారు. కలిగిరి మండల అపస్ అధ్యక్షులు అంకినపల్లి మధు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
ASR: రంపచోడవరం మండలం తాళ్లపాలెం గ్రామంలో శనివారం తెల్లవారుజామున ఆవుపై పులి దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు ఆదివారం అధికారికంగా ప్రకటన చేశారు. పులి దాడి చేసిన ఆవు కళేబరాన్ని దహణం చేశారు. సబ్ DFO సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం కోరుమిల్లి గ్రామం సమీప అటవీ ప్రాంతంలో దట్టమైన పొదలలో పులి ఉన్నట్లు తెలిపారు.
SKLM: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. ఈ మేరకు శనివారం జారీ చేసిన జీవో ద్వారా హామీ అమల్లోకి వచ్చింది. ఆదివారం జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి భాస్కరరావు దివ్యాంగులు తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
VZM: అంగన్వాడీలకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చరిత్రలోనే తొలిసారిగా రెండు సార్లు అంగన్వాడీ వేతనాలు పెంచిన ఘనత టీడీపీ ప్రభుత్వానికీ, నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు.
E.G: బిక్కవోలు మండలం పందలపాకలో పడాల సూర్యనారాయణరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా బ్లడ్ డోనర్స్ & వాలంటీర్స్ను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రక్తదానం ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడుకోవచ్చన్నారు.