• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుంతకల్లు పట్టణ ప్రజలకు శుభవార్త.!

ATP: గుంతకల్లు మున్సిపాలిటీలో ఆస్తిపన్ను బకాయిల చెల్లింపుపై 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి మంగళవారం మీడియాకు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్నును ఒకే విడతలో చెల్లిస్తే 50 శాతం రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

March 17, 2026 / 06:06 PM IST

ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ కింద వాహనం పంపిణీ

KRNL: ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ పాలసీ కింద 45 శాతం సబ్సిడీతో అందిస్తున్న TATA V-50 వాహనాన్ని ఇవాళ ఎమ్మెల్యే బీ.వీ. జయ నాగేశ్వర్ రెడ్డి ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన నాగరాజుకు అందజేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంపొందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. SC/ST వర్గాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఇలాంటి పథకాలను వినియోగించుకోవాలని యువతకు సూచించారు.

March 17, 2026 / 06:00 PM IST

రంజాన్‌లో రక్తదానం సేవలు

అన్నమయ్య: పవిత్ర రంజాన్ మాసంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ రక్తదాన సేవలు కొనసాగిస్తోంది. పీలేరు ప్రాంతానికి చెందిన క్యాన్సర్ పేషెంట్‌కు అత్యవసరంగా A నెగటివ్ రక్తం అవసరమవడంతో డాక్టర్ సయ్యద్ మైనుద్దీన్ ఆధ్వర్యంలో జాకీర్ అనే యువకుడు వెంటనే స్పందించి రక్తదానం చేశాడు. జాకీర్‌ను నిర్వాహకులు రియల్ హీరోగా అభినందించారు.

March 17, 2026 / 06:00 PM IST

రైతులకు అండగా నిలవడమే వారోత్సవాల లక్ష్యం

ELR: కొయ్యలగూడెం(మం) దిప్పకాయలపాడు గ్రామంలో మంగళవారం ‘రైతన్నా మీకోసం’ వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏపీ ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామస్థాయిలో రైతులకు అండగా నిలవడమే ఈ వారోత్సవాల లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. రైతులకు అందుతున్న పథకాలు, క్షేత్రస్థాయి సమస్యలపై అడిగి తెలుసుకున్నారు.

March 17, 2026 / 06:00 PM IST

పండుగల సందర్భంగా పరిశుభ్రతపై ఎస్‌డీపీఐ వినతి

ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా దేవాలయాలు, ఈద్గా పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని ఇవాళ ఎస్‌డిపిఐ నాయకులు కోరారు. ఈ మేరకు ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్‌కు ఎస్‌డిపిఐ శ్రీశైలం అసెంబ్లీ కమిటీ వినతి పత్రం సమర్పించింది. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు ఆరిఫ్ హుస్సేన్, సభ్యులు మాసూం, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 06:00 PM IST

కులవృత్తిని కాపాడాలని నాయి బ్రాహ్మణుల ర్యాలీ

W.G: పాలకొల్లులో మంగళవారం నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఇతర కులస్థులు, కార్పొరేట్ సంస్థలు క్షవర వృత్తిలోకి రావడం వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటోందని జిల్లా అధ్యక్షుడు ఉప్పలపు దుర్గా పెద్దిరాజు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరించారు.

March 17, 2026 / 06:00 PM IST

గంజాయి అక్రమ రవాణా.. నిందితుడు అరెస్ట్

ప్రకాశం: గుడ్లూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో గంజాయి అక్రమ రవాణా వ్యవహారం బయటపడింది. చెన్నైకు చెందిన సాయికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి సుమారు 19 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదం అనంతరం గంజాయి సంచులను దాచిపెట్టి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొందరు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.

March 17, 2026 / 05:58 PM IST

నందిగామ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే

NTR: నందిగామ అభివృద్ధికి కూటమి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే సౌమ్య మంగళవారం అన్నారు. నందిగామ బాబు జగజీవన్ రామ్ బిల్డింగులో నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో ఆమె పాల్గొని, గత సంవత్సర కాలంలో రూ.114 కోట్లతో పట్టణ పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. అలాగే 24 గంటల నీటి సరఫరా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:57 PM IST

సంతమాగులూరులో రైతన్న మీకోసం కార్యక్రమం

 BPT: సంతమాగులూరు మండలంలోని గ్రామాల్లో “రైతన్న మీకోసం” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఓ సైదా పాల్గొని రైతులకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు అంశాలపై అవగాహన కల్పించారు. రైతుల సమస్యలు తెలుసుకుని తగిన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:55 PM IST

గుంటూరులో మహిళలకు గ్రీవెన్స్ కార్యక్రమం

గుంటూరు పశ్చిమలో ఎమ్మెల్యే గళ్ళా మాధవి ఆధ్వర్యంలో మహిళల కోసం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. అనేక మంది మహిళలు హాజరై తమ సమస్యలను వెల్లడించారు. ప్రతి మంగళవారం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని ఆమె చెప్పారు. వీధి కుక్కల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం అధికారులతో పాటు ప్రజలతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

March 17, 2026 / 05:54 PM IST

మీసేవలో అదనపు వసూళ్లు.. కార్మికుల ఆగ్రహం

GNTR: తుళ్లూరు ఎక్స్చేంజ్ సెంటర్‌లోని మీసేవ కేంద్రంలో కార్మికుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫోన్ నంబర్ లింక్ సేవకు రూ. 70 బదులు రూ. 250 వరకు తీసుకుంటున్నారని, రసీదుల్లో అసలు మొత్తం చూపించడం లేదని కార్మికులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

March 17, 2026 / 05:52 PM IST

‘మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలి’

BPT: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని నియోజకవర్గ సమన్వయకర్త డా. అశోక్ కుమార్ చింతలపూడి పిలుపునిచ్చారు. అద్దంకిలోని సింగరకొండ భవన్‌లో మున్సిపల్ ఛైర్మన్, కౌన్సిలర్ల పదవీకాలం ముగిసిన సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వైసీపీ చేసిన అభివృద్ధి పనులే పార్టీ విజయానికి బలం అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 17, 2026 / 05:52 PM IST

సివిల్స్ విజేతకు కలెక్టర్ ఘన సత్కారం

SKLM: ప్రభుత్వ బడిలో చదివి, పేదరికాన్ని జయించి సివిల్స్‌లో 463వ ర్యాంక్ సాధించి సత్తా చాటిన సౌరోతు రామును జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాము ప్రతి విద్యార్థికి ఒక గొప్ప ఆదర్శం అని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.

March 17, 2026 / 05:51 PM IST

FPOల మార్కెట్ లింకేజీలపై లోక్‌సభలో ప్రశ్న

CTR: రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (FPOలు) మార్కెట్ లింకేజీల బలోపేతంపై కేంద్రం తీసుకున్న చర్యలను వివరించాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు లోక్‌సభలో ప్రశ్నించారు. APEDA ద్వారా ఎక్స్‌పోర్ట్ ప్రోత్సాహం, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 37 FPOలు ఆన్‌బోర్డ్ చేసినట్లు వెల్లడించింది.

March 17, 2026 / 05:48 PM IST

విశాఖకు సెమీ రింగ్ రోడ్ ప్రాజెక్ట్

విశాఖ నగర అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం 70 కిలోమీటర్ల సెమీ రింగ్ రోడ్ నిర్మాణానికి నిర్ణయం తీసుకుంది. భోగాపురం విమానాశ్రయం నుంచి రాంబిల్లి వరకు ఈ రహదారి ఆనందపురం, పెందుర్తి, సబ్బవరం గుండా సాగనుంది. ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో పాటు పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు.

March 17, 2026 / 05:48 PM IST