BPT: అద్దంకి మండలం సింగరకొండలో శనివారం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. తిరునాళ్ల సందర్భంగా ఆయన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని ఆదేశించారు.
KDP: మార్చి 1న కడపలో గ్రేటర్ రాయలసీమ ప్రాజెక్టులపై కీలక సమావేశం జరగనుంది. సమావేశ ఏర్పాట్లను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మేయర్ సురేష్ తదితరులు పరిశీలించారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాలు, కృష్ణా జలాలు, పెండింగ్ ప్రాజెక్టులపై గట్టి పోరాటానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
PPM: ఖైదీల పట్ల మానవీయ దృక్పథంతో వ్యవహరించాలని సబ్ జైలు అధికారులకు అడిషనల్ ఫస్ట్ క్లాస్ జ్యూడీషియల్ మేజిస్ట్రేట్ జె. సౌమ్య జోస్ఫిన్ సూచించారు. శనివారం పార్వతీపురం పట్టణంలోని సబ్ జైలును ఆమె ఆకస్మికంగా సందర్శించి సమగ్రంగా తనిఖీ నిర్వహించారు. జైలులో ఖైదీల పరిస్థితులు, సదుపాయాలు మరియు భద్రతా వ్యవస్థలను ఆమె స్వయంగా పరిశీలించారు.
కోనసీమ: ఆలమూరు మండలం పరిధిలోని బడుగువాని లంక గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో రూ.15 లక్షల వ్యయంతో నిర్మాణంలో ఉన్న కల్వర్ట్ పనులను శనివారం ఎంపీడీవో ఎ.రాజు పరిశీలించారు. గ్రామ ప్రజల రాకపోకలకు అనుకూలంగా, ముఖ్యంగా వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను నివారించే లక్ష్యంతో ఈ కల్వర్ట్ నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు.
PLD: వినుకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ప్రపంచ టైలర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు హాజరయ్యి కుట్టు మిషన్ సృష్టికర్త చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంగంలో విశేష సేవలు అందిస్తున్న టైలర్లను శాలువాలతో సన్మానించారు.
SKLM: కాశీబుగ్గ బస్టాండ్ ఆవరణంలో ఉన్న అన్న క్యాంటీన్ను శనివారం మధ్యాహ్నం ఏపీటీపీసీ ఛైర్మన్ బాబురావు సందర్శించారు. అనంతరం పలాస టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సప్ప నవీన్తో కలిసి ఆయన భోజన రుచిని పరీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేవలం ఐదు రూపాయలకే పేదవాడికి కడుపునిండా భోజనం కూటమి ప్రభుత్వంలో తిరిగి ప్రారంభించామని తెలిపారు.
VZM: మెరకముడిదాం మండలంలోని చెల్లాపురం సర్పంచ్ రెడ్డి వరంను శనివారం తన నివాసంలో పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీడీపీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ఇటీవల ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తనను గృహనిర్బంధం చేశారని పోలీసులు తెలిపారు. పార్టీకి రాజీనామా చేసిన నన్ను ఇలా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం అన్నారు.
అన్నమయ్య: జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్కు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించుకోవాలని, శాస్త్రాన్ని దైనందిన జీవితంలో అన్వయించుకోవాలని సూచించారు. ఉత్తమ ప్రదర్శనలు కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
PLD: పేద ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం రాజుపాలెం మండలం కొండమోడు వీరమ్మ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు ఇంటింటికీ వెళ్లి వృద్ధులకు, దివ్యాంగులకు పెన్షన్ దారులకు డబ్బు అందజేశారు.
కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి, 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో పచ్చదనాన్ని పెంచేందుకు విస్తృతంగా మొక్కల పెంపకం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇవాళ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షలో, జిల్లా వ్యాప్తంగా 45 లక్షల మొక్కలు నాటే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేయాలని, జాతీయ రహదారులు, ఆర్&బీ రహదారుల వెంట మొక్కలు నాటి, వాటిని సంరక్షించే చర్యలు తీసుకోవాలన్నారు.
TPT: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం హిస్టరీ, బాటనీ పేపర్–II పరీక్షలు శనివారం నిర్వహించారు. జనరల్ కోర్సులో 5,033 మందికి గాను 4,930 మంది హాజరై, 103 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్ కోర్సులో 1,090 మందికి గాను 1,058 మంది హాజరై, 32 మంది గైర్హాజరయ్యారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.
NTR: గంపలగూడెం మండలం తునికపాడు గ్రామంలో రామిశెట్టి సత్యంబాబు అనే లబ్ధిదారుడికి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 44,231 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అండగా నిలుస్తుందని తెలిపారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి దూరం చేసిందని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఆరోపించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వాసవి నగర్ మెయిన్ రోడ్డులో సీసీ డ్రెయిన్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
W.G: ఉండి మండలం మహదేవపట్నం హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. M. జాన్ బాబు సైన్సు ప్రాముఖ్యత, మూఢనమ్మకాలు నిర్మూలన అవగాహన కల్పించారు. సైన్స్ ఉపాధ్యాయులు K.V నాగేశ్వర రావు, K. శ్రీలత, P. లక్ష్మణుడు EPC సురేష్ పాల్గొన్నారు.
TPT: తిరుమలలో రీల్స్ చేసిన యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీమ్పై TTD ఆగ్రహం వ్యక్తం చేసింది. స్వప్రయోజనాల కోసం కొండపై అసత్య కథనాలతో రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఇవాళ ఘాట్ రోడ్డుతో పాటు ఆలయం ఎదుట, పుష్కరిణి సమీపంలో, కౌంటర్ల వద్ద గీతూ రాయల్ అండ్ టీం రీల్స్ చిత్రీకరించి SMలో పోస్ట్ చేశారు.