GNTR: మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో మరిన్ని మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి, సౌకర్యాలపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎయిమ్స్ను ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్ఠాత్మకమైన రీసెర్చ్, అకాడమిక్ సంస్థగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.
కృష్ణా: ఘంటసాల గ్రామంలో పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాటు చేసిన “ఐ లవ్ ఘంటసాల” సెల్ఫీ పాయింట్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఈ ఆకర్షణీయ నిర్మాణం స్థానికులు, సందర్శకులను ఆకట్టుకుంటోంది. పర్యాటకులు ఇక్కడ ఫోటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
SKLM: నరసన్నపేట మండలంలో ఈనెల 16వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం అవుతున్నామని ఎంఈఓ పేడాడ దాలినాయుడు తెలిపారు. ఇవాళ ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ.. 10 పరీక్షలకు సంబంధించి 1268 మంది విద్యార్థులు రాస్తుండగా ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసేమన్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు కొనసాగుతాయి అన్నారు.
W.G: రాష్ట్ర శాసనసభ సందర్శనకు తణుకు కొండేపాటి సరోజినీ దేవి మహిళా కళాశాల విద్యార్థినిలు వెళ్లారు. శాసనసభను సందర్శించి సభ విశిష్టత, ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని అధికారులు, ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులు తెలుసుకున్నారు. చదువుకునే వయస్సులోనే ఇటువంటి పర్యటనల ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామ్యంపై అవగాహన ఏర్పడుతుందన్నారు.
CTR: వేసవి దృష్ట్యా కనీసం 1,800 ట్రాన్స్ఫార్మర్లను నిల్వ ఉంచాలని చిత్తూరు ట్రాన్స్కో ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం నెలకు 400కిపైగా ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతుకు వస్తుండగా, ఏప్రిల్లో ఈ సంఖ్య రెండింతలు పెరిగే అవకాశం ఉందన్నారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి తణుకు వాస్తవ్యులు పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి కుటుంబసభ్యులు రూ. 60 లక్షలు విలువ చేసే 350 గ్రాముల బంగారంతో చేసిన మకర తోరణాన్ని శుక్రవారం సమర్పించారు. దాత కుటుంబ సభ్యులు ఈ మకర తోరణాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధర్ రావుకు అందజేశారు. ఆయన వారిని సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీకామాక్షి సమేత అగస్తీశ్వర స్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం, నూతన విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నేత చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి హాజరై స్వామివారిని దర్శించుకోగా, ఆయనతో పాటు తిరుపతి రూరల్ ఎంపీపీ విడుదల మాధవ రెడ్డి పాల్గొన్నారు.
అన్నమయ్య: రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి హర్షవీణ ఇవాళ స్థానిక కోర్టుకు హాజరుకానున్నారు. ఎమ్మెల్యే తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో నమోదైన కేసులో హైకోర్టు మార్చి 2న హర్షవీణకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు బెయిల్ షూరిటీలు స్థానిక కోర్టులో దాఖలు చేయనున్నారు.
GNTR: వ్యవసాయంతో గ్రామీణ అభివృద్ధిలో మార్పు అనే అంశంపై రైతులకు వెబినార్ సందేశం, సమావేశం శుక్రవారం ఫిరంగిపురం–1 రైతు సేవా కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు ఎన్. మోహన్రావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం అమలు చేస్తున్న వివిధ పథకాల గురించి వివరించారు.
PPM: రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ రూపొందించిన ‘స్వర్ణాంధ్ర@2047’ క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో జిల్లా అధికారుల చొరవ, సహకారంతో జిల్లా ముందంజలో ఉందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో జేసీ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
W.G: పోడూరు మండలం చింతలగరువు స్కూల్లో ఇవాళ HM కొల్లాబత్తుల సూర్య కుమార్ అధ్యక్షతన జాతీయ దంత వైద్యుల దినోత్సవం జరిపారు. MIHP ఎం. అనిత మాట్లాడుతూ.. మన దంతాలు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం అన్నారు. దంతాల పట్ల విద్యార్థులు తీసికోవలసిన జాగ్రత్తలు గురించి వివరించారు. ANM వి.మాలిని, హెల్త్ అసిస్టెంట్ R.రాజేష్, ఆశా వర్కర్ M. నిర్మలాకుమారి పాల్గొన్నారు.
NDL: బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలో ఇవాళ ఎంపీడీవో గాయత్రి పర్యటించారు. ఇంటి పన్ను, కులాయి పన్ను సక్రమంగా చెల్లించి గ్రామ అభివృద్ధికి సహకరించాలని ప్రజలకు సూచించారు. పారిశుద్ధ్య పనులు సరిగా జరగడం లేదని, దోమల బెడద అధికమైందని గ్రామస్తులు ఆమె దృష్టికి తెచ్చారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణా: 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి తెలిపారు. శుక్రవారం చల్లపల్లి అశోక్ నగరులో గ్రామ పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 4లక్షలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం పనులు చేపట్టారు. సర్పంచ్ పూజలు చేసి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ ఈఓ పీవీ మాధవేంద్రరావు, వార్డ్ సభ్యులు మీర్ రిజ్వాన్ పాల్గొన్నారు.
అన్నమయ్య: మదనపల్లె మార్కెట్లో శుక్రవారం టమాటా ధరలు భారీగా పడిపోయాయి. ఇవాళ మార్కెట్కు సుమారు 70 మెట్రిక్ టన్నుల టమాటాలను రైతులు తీసుకొచ్చారు. వ్యాపారులు మొదటి రకం 10 కిలోల బాక్స్ను రూ.110కు, రెండో రకం బాక్స్ను రూ. 90కు కొనుగోలు చేశారు. పంట దిగుబడి బాగున్నప్పటికీ గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
KRNL: ఆదోనిలోని జాతీయ వ్యవసాయ మార్కెట్ యార్డుకు ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చిందని శుక్రవారం యార్డు కార్యదర్శి గోవిందు తెలిపారు. 2025-26 సంవత్సరానికి ప్రభుత్వం రూ.18 కోట్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించగా, ఇప్పటికే రూ.18.40 కోట్లు వసూలయ్యాయని చెప్పారు. రైతులకు పంటలు బాగా దిగుబడి రావడంతో యార్డులో క్రయవిక్రయాలు ఎక్కువగా జరిగాయని తెలిపారు.