VSP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు గాజువాక చేరుకున్నారు. ఇవాళ ఉదయం ఉడాకాలనిలో మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఇంటికి వెళ్లారు. విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు భారీగానే అంబటి రాంబాబును కలిసేందుకు తరలివచ్చారు. అంబటి రాంబాబు, కర్ణం ధర్మశ్రీ కొంతసేపు పార్టీ విషయాలు, ఇతర అంశాలపై మాట్లాడుకున్నట్టు సమాచారం.
KDP: చీనీ సాగు రైతులకు కలసి రావడం లేదు. సాగులో నష్టాలు తప్ప లాభాలు రాకపోవడంతో దీర్ఘకాలిక పంటలతో ఆదాయం ఉంటుందనుకున్నా రైతులకు నిరాశే మిగిలింది. వేముల మండలంలో 2 వేల ఎకరాల్లో రైతులు చీని సాగు చేసినట్లు తెలిపారు. భూమిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంవల్ల చీని చెట్లు వాడులేక పూత రావడం లేదన్నారు. సాగులో నష్టాలు వస్తున్నాయన్నారు. దీంతో చేసేదేమిలేక చెట్లను తొలగిస్తున్నారు.
KDP: మైదుకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఓబులరెడ్డి ఇవాళ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. జాబ్ మేళాకి విద్యార్హత పత్రాలు తీసుకురావాలని సూచించారు.
NDL: జూపాడుబంగ్లా మండలం తర్తూరులో వెలిసిన శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 26న పూల సఫార ఉత్సవం, 27న సింహ వాహన, 28న హంస, 29న శేష, 30న హనుమద్వాహన, 31న గరుడ, ఏప్రిల్ 1న గజవాహన, 2న రథోత్సవం, 3న అశ్వవాహన, 4న వసంతోత్సవం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
AKP: రాష్ట్రంలో 2014-2025 వరకు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బాణసంచా కేంద్రాలపై 3,219 కేసులు నమోదు చేసినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం శాసనసభలో ప్రకటించారు. వీటిలో 2,753 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు.152 కేసులు దర్యాప్తులో ఉన్నాయన్నారు. అదే కాలంలో పోలీస్ శాఖ 26.56 కోట్ల విలువైన బాణసంచ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
KKD: వేట్లపాలెం బాణాసంచా పేలుడు ఘటనలో తీవ్రంగా గాయపడి కాకినాడ GGHలో చికిత్స పొందుతున్న ఎం.శ్రీను (30) గురువారం మృతి చెందాడు. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 27కు చేరుకుంది. ఆసుపత్రికి వచ్చిన తొమ్మిది మందిలో ఏడుగురు మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మరో ఇద్దరు క్షతగాత్రులు ప్రస్తుతం GGHలో చికిత్స పొందుతున్నారు.
నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పని తీరుపై ఓ వృద్ధురాలు సంతోషం వ్యక్తం చేశారు. ఒకే ఒక అర్జీని కలెక్టర్కు ఇవ్వడంతో తన కుమారుడి నుంచి తన ఇంటిని తనకు ఇప్పించారని చెప్పారు. సమస్య పరిష్కరించిన కలెక్టర్ను వృద్ధురాలు రమాజ్యోతి కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని కలెక్టర్ చెప్పారు.
అనంతపురం జిల్లాలో ఎల్ నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. మార్చి రెండో వారం నుంచి ఎండలు తీవ్రస్థాయికి చేరి, 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆస్కారం ఉందన్నారు. వడగాలులు తీవ్రం కావడంతో పాటు వర్షాలు ఆలస్యంగా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వర్షపాతం కూడా కొన్ని ప్రాంతాలకే పరిమితం కావచ్చని అంచనా వేశారు.
ELR: ఉంగుటూరు దళితపేటలో దీర్ఘకాలికంగా విద్యుత్ సమస్య తీర్చమని విద్యుత్ శాఖ ఏడీఏ రాళ్లపల్లి భీమేశ్వరరావు అన్నారు. ఉంగుటూరులో ఏర్పాటు చేసిన 100 కేవీ ట్రాన్స్ఫార్మర్లను ఆయన ప్రారంభించారు. ఎన్నో సంవత్సరం నుంచి ఉన్న సమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ సింధు ఏఈ శ్రీరామ్, లైన్మెన్ నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.
అన్నమయ్య: తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన పెద్దమండెం మండల టీడీపీ అధ్యక్షుడు జిట్టా వెంకటరమణ జన్మదిన వేడుకలు పార్టీ నేతలు మదనపల్లెలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
VZM: సైబర్ నేరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డి సూచించారు. మహిళా దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా కలక్టరేట్లో బుధవారం పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి డిజిటల్ యుగంలో మహిళలు సాంకేతికతను వినియోగించుకుంటూనే, ఆన్లైన్ వేదికలపై పొంచి ఉన్న సైబర్ ముప్పు పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలన్నారు.
NDL: డోన్ పట్టణంలోని ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన బాధితులకు టీడీపీ యువ నేత కోట్ల రాఘవేంద్రారెడ్డి రూ.1,52,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. పేద ప్రజలకు CMRF గొప్ప వరమని, ఈ సాయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
KDP: చెన్నూరు మండల వ్యాప్తంగా గుర్రంపాడు, ఓబులంపల్లె గ్రామాల్లో మామిడి పంటను సాగుచేసిన రైతులకు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో 50% రాయితీతో మామిడి పంటకు కవర్లు ఇవ్వనున్నట్లు ఉద్యానశాఖ అధికారి రామకృష్ణ గురువారం తెలిపారు. ఎకరాకు 6,000 ఫ్రూట్ కవర్లు అవసరమవుతాయన్నారు. హెక్టారుకు 15 వేల కవర్లు రాయితీతో అందించాలన్నారు. పంటపూత పిందే దశలో ఉంటే కవర్లు వినియోగించాలని సూచించారు.
NLR: రామాయపట్నం పోర్టు కార్యకలాపాలు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరున కచ్చితంగా ప్రారంభమవుతాయని మంత్రి BC జనార్ధన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ పాపాలు, కోర్టు కేసులతో పోర్టు పనులు సకాలంలో పూర్తి కాలేదని చెప్పారు. ఇప్పుడు వాటిని పరిష్కరించి పనుల్లో వేగం పెంచామన్నారు. ఇప్పటికే 74% పనులు పూర్తైనట్లు ప్రకటించారు.
BPT: జిల్లాలో రబీ సీజన్కు సరిపడా 8, 641 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మార్చి 25 వరకు రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, పీఏసీఎస్, రైతు సేవా కేంద్రాలు ప్రైవేట్ దుకాణాల్లో నిల్వలు సిద్ధంగా ఉన్నాయన్నారు. 45 కిలోల యూరియా బస్తా ధర రూ. 266.50 మాత్రమేనని, ఎవరైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.