TPT: శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో పరాభవ నామ సంవత్సరం సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయు లింగేశ్వరుడు పర్వత, చప్పర వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్లను వివిధ రకాల ఆభరణాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. స్వామివారు మేరు పర్వత వాహనంపై, అమ్మవారు చప్పర వాహనంపై అధిష్టించి పురవీధులలో ఊరేగించారు.