KRNL: కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమార స్వామిని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కుమార స్వామి నివాసంలో ఎంపీ శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా జిల్లాలో ప్రతిపాదిత పారిశ్రామిక ప్రాజెక్టుల పురోగతి, కొనసాగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి వివరించారు.