E,G: కొంతమూరు సబ్ స్టేషన్ పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. ఆర్డీఎస్ఎస్ పనుల నేపథ్యంలో ఉదయం10 గంటల నుంచి 2 గంటల వరకు పరిసరాల్లో విద్యుత్ ఉండదన్నారు. దీంతో కళ్యాణ్ నగర్, ఆదర్శనగర్, జంగాల కాలనీ, ఉద్యోగుల కాలనీ, ఫోర్త్ బ్రిడ్జి, సాయిరాం కాలనీ, బొమ్మన కాలనీ, కోలమూరు, రాయుడు పాకలలో విద్యుత్ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.