అన్నమయ్య: చిట్వేలు మండలానికి చెందిన విద్యార్థి మొకం వెంకట సాకేత్ యాదవ్ జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష-2026లో 91.25 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ఉత్తీర్ణుడై నవోదయ సీటు సాధించాడు. శ్రీ సాయి వికాస్ హైస్కూల్లో చదువుతున్న సాకేత్ క్రమశిక్షణ, పట్టుదల, గురువుల మార్గదర్శకత్వంతో ఈ విజయం సాధించాడు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం అతని విజయంపై ఆనందం వ్యక్తం చేశారు.