• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గూళ్యం స్వామి జాతరలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ

KRNL: హలహర్వి మండలం, గూళ్యం గ్రామంలో నిర్వహించిన శ్రీ గాదిలింగేశ్వర స్వామి జాతర మహోత్సవంలో టీడీపీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం శివ ప్రసాద్ స్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ.. సుఖసంతోషాలతో ఉండాలని నాయకులు ప్రార్థించారు.

February 23, 2026 / 07:17 PM IST

W.G: దివ్యాంగుని పింఛన్ కోసం విన్నపం..!

W.G: నరసాపురం మండలం కొప్పర్రు గ్రామానికి చెందిన చేరుగొండి రాజ్ కుమార్ సోమవారం ఆర్డీవో దాసిరాజుకు వినతిపత్రం సమర్పించారు. తన కుమారుడు ప్రభాకర్ (6)పుట్టుకతోనే 90 శాతం శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడని, మెడికల్ బోర్డు ధ్రువీకరణ ఉన్నా పింఛన్ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబం కావడంతో ప్రభుత్వం స్పందించి పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలన్నారు.

February 23, 2026 / 07:17 PM IST

విశాఖలో మాక్ డ్రిల్ విజయవంతం

VSP: అత్యవసర పరిస్థితుల్లో సమన్వయ స్పందనను పరీక్షించేందుకు హెచ్‌పీసీఎల్‌, విశాఖ డిస్పాచ్ స్టేషన్, విశాఖ రిఫైనరీ సంయుక్తంగా నరవగ్రామం వద్ద లెవల్–3 ఆఫ్‌సైట్ మాక్ డ్రిల్ నిర్వహించాయి. అగ్నిప్రమాదం, ఉత్పత్తి లీకేజీ పరిస్థితులను అనుకరించి అలర్ట్ వ్యవస్థ అమలు, అగ్ని నియంత్రణ, ప్రజల తరలింపు చర్యలను సమన్వయంతో ప్రదర్శించారు.

February 23, 2026 / 07:15 PM IST

ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వాష్ శిక్షణ

విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో APMAS ఎన్జీవో సహకారంతో మెప్మా ఆధ్వర్యంలో WASH (నీరు, పరిశుభ్రత, ఆరోగ్యం) పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.వి. చిట్టిరాజు పాల్గొని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో స్వచ్ఛమైన నీరు, పరిశుభ్రత ముఖ్యమని పేర్కొన్నారు.

February 23, 2026 / 07:15 PM IST

అష్టలక్ష్మి ఆలయ గుడి వద్ద అక్రమ తవ్వకాలు

 తూ.గో: గోకవరం మండలం రంపఎర్రంపాలెంలోని అష్టలక్ష్మి గుడి వెనుక గల ఎర్రమట్టి కొండలను మాఫియా ముఠాలు తవ్వి తరలిస్తున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రివేళల్లో లారీల్లో మట్టిని రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని వాపోయారు. కొండల మీద చెట్లను నరికివేస్తుండటం వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

February 23, 2026 / 07:14 PM IST

NDL: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

NDL: ప్యాపిలి మండలం బూరుగుల గ్రామంలో అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు కొక్కంటి రామకృష్ణ (50) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రాచర్ల ఎస్సై రమేశ్ బాబు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనతో బూరుగుల గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం ఏర్పడింది, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

February 23, 2026 / 07:14 PM IST

శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం హుండీ ఎంతంటే..?

CTR: చౌడేపల్లి మండలం బోయకొండ గంగమ్మకు హుండీ లెక్కింపు ద్వారా రూ. 59లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. సోమవారం అమ్మవారి హుండీ లెక్కించారు. రూ.59,35,838 నగదు, 38 గ్రాముల బంగారు, 155 గ్రాములు వెండి, విదేశీ కరెన్సీ నోట్లు, కాయిన్స్‌ వచ్చినట్టు తెలిపారు. ఈ మొత్తం 45 రోజుల్లో భక్తులు అమ్మవారికి హుండీ ద్వారా సమర్పించారన్నారు.

February 23, 2026 / 07:13 PM IST

రేపు విద్యుత్ సరఫరా బంద్

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలో రేపు మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. ఏరియా హాస్పిటల్ ఏరియా, వెలమ వీధి, తురకబడి, కొత్త వీధి, గవర వీధి, పాత సంత బయలు, ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. మెయింటినెన్స్ పనుల నిమిత్తం సరఫరా ఆపేస్తున్నామని వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 23, 2026 / 07:13 PM IST

కార్యకర్తల సభకు వెళ్లేందుకు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ర్యాలీ

నెల్లూరు: కావలి పట్టణంలో RSR కల్యాణ మండపంలో సోమవారం నిర్వహిస్తున్న విస్తృతస్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశానికి కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెంకి వెంకటరెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కార్యకర్తలతో రామిరెడ్డి నివాసం నుంచి సభ ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

February 23, 2026 / 07:12 PM IST

పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్

అన్నమయ్య: PGRS అర్జీలను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో 348 అర్జీలను స్వీకరించారు. అర్జీలపై ఆడిట్ నిర్వహించి పెండింగ్ లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి భూమి,దారి,విద్యుత్ సమస్యలపై విజ్ఞప్తులు అందగా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు.

February 23, 2026 / 07:12 PM IST

26 నుంచి జనసేన సభ్యత్వ నమోదు: మంత్రి

E.G: పవన్ కళ్యాణ్ ఆశయ సాధనే లక్ష్యంగా జనసేన సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని మంత్రి కందుల దుర్గేశ్ పిలుపునిచ్చారు. సోమవారం హుకుంపేట కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రారంభం కానుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

February 23, 2026 / 07:06 PM IST

‘వ్యవసాయ రంగానికి 50 శాతం నిధులు కేటాయించాలి’

NTR: 2026-2027 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి కనీసం 50 శాతం నిధులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విజయానంద్‌కు విజ్ఞప్తి చేసింది. గంపలగూడెంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య మాట్లాడుతూ.. రైతు సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని అన్నారు.

February 23, 2026 / 07:05 PM IST

గంగూరులో పదిమంది అరెస్ట్

కృష్ణా: గంగూరులో జూదం ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు సోమవారం మెరుపు దాడి నిర్వహించారు. ఈ దాడిలో జూదంలో పాల్గొన్న 10 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.55,250 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నామని, అక్రమ జూద కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

February 23, 2026 / 07:03 PM IST

‘సంత్ గాడ్గే బాబా ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

సత్యసాయి: సంత్ గాడ్గే బాబా ఆయన ఆశ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు జి. ఎం. శేఖర్ పిలుపునిచ్చారు. సోమవారం ధర్మవరంలో గాడ్గే బాబా 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. మహారాష్ట్రలో ఒక వెనుకబడిన తరగతుల కుటుంబంలో జన్మించి, స్వచ్చందంగా పేదరికాన్ని స్వీకరించి గ్రామాలు తిరుగుతూ ప్రజల్లో చైతన్యం కలిగించారన్నారు.

February 23, 2026 / 07:01 PM IST

కాలనీలో తాగునీటి సమస్యపై మహిళల వినతి

CTR: తవణంపల్లిలోని జొన్నగురకలలో కాలనీవాసులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో సరైన నీటి సరఫరా లేకపోవడంతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రటరీ రామరాజు ఆధ్వర్యంలో కాలనీవాసులు డిప్యూటీ ఎంపీడీవో రాజశేఖర్‌కు వినతి పత్రం అందించారు. వెంటనే తాగునీటి సరఫరా మెరుగుపరచాలని ఎంపీడీవో సంబంధిత అధికారులను ఆదేశించారు.

February 23, 2026 / 07:01 PM IST