KDP: మైలవరం మండలం వద్దిరాలలో సుంకులాంబ పరంజ్యోతి తిరుణాల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 5 వరకు చెన్నయ్య ఆధ్వర్యంలో చెక్కభజన నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు సిరిమానోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి 8 వరకు ఆధ్యాత్మిక ప్రవచనాలు, 9 నుంచి నెల్లూరు వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.