SKLM: కొత్తూరులో టీచర్స్ మెగా క్రికెట్ టోర్నమెంట్ ఇవాళ నుంచి జరగనుంది. స్థానిక ఉన్నత పాఠశాల మైదానం, ఓండ్రుజోల సమీపంలోని మైదానాల్లో ఈ టోర్నమెంట్ జరుగుతోందని ఎంఈవోలు గోవిందరావు, శ్రీనివాస రావు తెలిపారు. 12 మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని, మూడు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో విజేతలకు నగదు బహుమతి, ట్రోఫీ అందిస్తామని తెలిపారు.