• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తిరుపతిలో నూతనంగా అనంత హాస్పిటల్స్ ప్రారంభం

TPT: నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘అనంత హాస్పిటల్స్ ప్రారంభోత్సవంలో తుడా ఛైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తిరుపతి ప్రజలకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి రావడం సంతోషకరమని తెలిపారు. ముఖ్యంగా న్యూరో, స్పైన్ విభాగాల్లో అధునాతన చికిత్సలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.

March 1, 2026 / 05:51 PM IST

‘గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి’

SKLM: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆదివారం మంత్రి తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు, అన్ని గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు,తాగునీరు పథకం అమలులో ఎక్కడా ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. ఇందులో ఆర్డీవో కృష్ణ‌మూర్తి, అధికారులు సుదాక‌ర్‌, తదితరులు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:51 PM IST

రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

ATP: రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం రైతులు చేపట్టిన దీక్షకు ఆదివారం ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అసెంబ్లీలో గళం విప్పి 12 చెరువులకు నీరు తెప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అనంతరం రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

March 1, 2026 / 05:49 PM IST

రాయలసీమలో అంతర్జాతీయ పాఠశాల ప్రారంభం

NDL: గోస్పాడు మండలం బాబానగర్ వద్ద 18 ఎకరాల్లో నిర్మించిన ‘శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్’ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం ప్రారంభించారు. 24వ వార్షికోత్సవం ‘ప్రవాహ్’ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో డా. పి.దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే లక్ష్యమన్ని పేర్కొన్నారు.

March 1, 2026 / 05:45 PM IST

పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన హెల్త్ డైరెక్టర్

SKLM: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం శ్రీకాకుళం లో డయేరియా కేసులపై పరిశీలించేందుకు వచ్చిన ఆమె తిరుగు ప్రయాణంలో అకస్మాత్తుగా లావేరు పీహెచ్సీని సందర్శించారు. స్థానిక కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సేవలను మౌలిక వసతులను స్వయంగా పరిశీలించారు. రోగులకు సరైన సమయంలో సేవలు అందించాలన్నారు.

March 1, 2026 / 05:43 PM IST

బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా దానియేలు

W.G: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా శృంగవృక్షం గ్రామానికి చెందిన సబ్బతి దానియేలు నియమితులయ్యారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదేశాలతో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని దానియేలు పేర్కొన్నారు.

March 1, 2026 / 05:42 PM IST

‘అంగన్వాడీలకు ప్రభుత్వం అండ’

PPM: అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, స్మార్ట్‌ఫోన్ల పంపిణీ, మినీ కేంద్రాల అప్‌గ్రేడ్ వంటి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని ఆమె వెల్లడించారు.

March 1, 2026 / 05:41 PM IST

నీలగరి తోటలో అగ్నిప్రమాదం

VZM: గజపతినగరం మండలంలోని గుడివాడ నీలగిరి తోటలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన నడిమింటి గాంధీకి చెందిన తోటలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. అజాగ్రత్తగా పొగ త్రాగడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. గజపతినగరం ఆగమాపకం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో వెళ్లి మంటల్లో అదుపు చేశారు.

March 1, 2026 / 05:41 PM IST

ప్రమాదానికి గురైన స్కూల్ బస్ సీజ్: డీటీవో

కోనసీమ: సఖినేటిపల్లి మండలం గొంది గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన స్కూల్ బస్సు ను సీజ్ చేశామని జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. లైసెన్స్ లేని క్లీనర్ బస్సు నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. బస్సు పర్మిట్‌ను నెలరోజులపాటు, డ్రైవర్ లైసెన్స్‌ను మూడు నెలల పాటు రద్దు చేశామన్నారు.

March 1, 2026 / 05:39 PM IST

నిబద్ధతతో జనగణన విధులు నిర్వర్తించాలి: కలెక్టర్

NTR: జనగణన విధులను అత్యంత నిబద్ధతతో, జవాబుదారీతనంతో నిర్వర్తించాలని లక్ష్మీశ స్పష్టం చేశారు. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాలలో సెన్సస్-2027 తొలి దశ (హౌస్ లిస్టింగ్ & హౌసింగ్ సెన్సస్)పై శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. కచ్చితమైన డేటా సేకరణ దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాదిగా నిలుస్తుందని, అందువల్ల ప్రతి అధికారి, తమ బాధ్యతలను అర్థం చేసుకొని పని చేయాలన్నారు.

March 1, 2026 / 05:38 PM IST

రాయలసీమ ప్రాజెక్టు ఆగితే ఉద్యమం తప్పదు: ఉషశ్రీ

సత్యసాయి: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును అడ్డుకుంటే ఉద్యమాలు చేస్తామని వైసీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఇంఛార్జ్‌ ఉషశ్రీ చరణ్‌ హెచ్చరించారు. ఆదివారం కడపలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సీమకు నీళ్లు రాకుండా సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తికాకపోతే ప్రాంతం ఎడారిగా మారుతుందని తెలిపారు.

March 1, 2026 / 05:34 PM IST

అడవి పంది దాడిలో మహిళకు గాయాలు

ప్రకాశం: అర్ధవీడు మండలం మొహిద్దిన్ పురం గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బండారు శివకుమారి అనే మహిళ మొక్కజొన్న తోటలోకి గడ్డి కోసం వెళ్లిన క్రమంలో అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో ఆ మహిళలకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నరసరావుపేటకు తరలించారు.

March 1, 2026 / 05:30 PM IST

రేపు గుంటూరు మున్సిపల్ కార్యలయంలో PGRS

GNTR: గుంటూరు నగరపాలక సంస్థ (GMC) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) నిర్వహించనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఓప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు కౌన్సిల్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. నగర వాసులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 1, 2026 / 05:30 PM IST

తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను పరామర్శించిన శివరాం

NDL: గోసానిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ వడ్డె సురేష్‌ను డోన్ మోటార్ వర్కర్స్ యూనియన్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి శివరాం ఇవాళ పరామర్శించారు. సురేష్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకుని, ధైర్యంగా ఉండాలని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు.

March 1, 2026 / 05:29 PM IST

ఈ నెల 3న సోమేశ్వరుడి ఆలయం మూసివేత

W.G: చంద్రగ్రహణం పురస్కరించుకుని భీమవరం గునుపూడిలోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి వారి ఆలయాన్ని ఈ నెల 3వ తేదీన మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. తిరిగి 4వ తేదీ (బుధవారం) ఉదయం 7 గంటలకు ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు కల్పిస్తామని వివరించారు.

March 1, 2026 / 05:27 PM IST