కృష్ణా: అంగన్వాడీ టీచర్లు, ఆయాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని MLA యార్లగడ్డ వెంకట్రావు ఓ ప్రకటనలో తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు తాగునీరు, టాయిలెట్లు, టీవీ, ఆర్వో సౌకర్యాలు కల్పించడంతో పాటు 58,204 మంది వర్కర్లకు 5జీ స్మార్ట్ఫోన్లు అందించామని తెలిపారు. మినీ కేంద్రాలను పూర్తిస్థాయి కేంద్రాలుగా అప్గ్రేడ్ చేసి పదోన్నతులు కల్పిస్తామన్నారు.
CTR: కాణిపాకం ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్లో 18.60 ఎకరాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలు, ధ్యాన మందిరం ఏర్పాటు తదితర వాటికి దీనిని ఉపయోగించనున్నట్టు సమాచారం.
ATP: కళ్యాణదుర్గం పరిధిలోని గువనపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులు ముదిగలకు చెందిన సోదరీసోదరులు చంద్రకళ (32), శివకుమార్ (36), హనుమంత రాయుడు (40)గా గుర్తించారు. కర్ణాటకలోని మొలకల్మూరులో వివాహానికి వెళ్లి వస్తుండగా, అనంతపురం నుంచి రాయదుర్గం వెళ్తున్న బస్సు వీరి కారును ఢీకొంది.
సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్లో సోమవారం రెవెన్యూ క్లినిక్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు. పుట్టపర్తి, పెనుకొండ, ధర్మవరం, కదిరి, మడకశిర డివిజన్ల అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి భూమి సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదార్ పేరు మార్పులు తదితర ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరిస్తామన్నారు. ప్రజలు ఫిర్యాదులు సమర్పించాలని కోరారు.
KRNL: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం రేపు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు APSPDCL సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల వినియోగదారులు 8977716661 నంబర్కు కాల్ చేసి తమ సమస్యలను తెలియజేయవచ్చన్నారు.
KDP: వల్లూరు మండలం పుష్పగిరి నదిలో ఆదివారం ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు యువకులు డ్యాం చూడటానికి వచ్చి సరదాగా నదిలో దిగారు. ప్రమాదవశాత్తు ముగ్గురు నదిలో కొట్టుకుపోయారు. సురేంద్ర (25) అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మిగిలిన ఇద్దరు శ్రీనాథ్, చైతన్య గల్లంతయ్యారు. శ్రీనాథ్ రైల్వే కొండాపురానికి చెందిన వ్యక్తిగా సురేంద్ర తెలపాడు.
PLD: శ్రీ బాల చార్మిక సమేత అమరేశ్వర స్వామి దేవస్థానం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి పాల్గున శుద్ధ పూర్ణిమ కేతు గ్రహ సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా దేవాలయము మూసివేయనున్నట్లు సహాయ కమిషనర్ రేఖ తెలిపారు. పునః ప్రారంభం నాలుగవ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు సంప్రోక్షణ అనంతరం గుడి తెరవబడుతుందని ఆమె అన్నారు. భక్తులు గమనించగలరని తెలిపారు.
కర్నూలు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)కు నియోజకవర్గ ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని, ప్రజల పాత్రే కీలకమని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ పి.విశ్వనాథ్ అన్నారు. ఆదివారం ఆయన ఏ.క్యాంపు మోంటెస్సోరి స్కూల్, కలెక్టరేట్ వెనుక ఇందిరా గాంధీ స్మారక మున్సిపల్ పాఠశాలలో నిర్వహించిన ఎస్ఐఆర్ స్పెషల్ క్యాంపెయిన్ను పరిశీలించారు.
KDP: కొండాపురం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున మంగలి చౌడప్ప (50) అనే వ్యక్తి రైలు కింద పడడంతో మృతి చెందినట్లు ఎర్రగుంట రైల్వే ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. మృతుడు స్థానిక మండలంలోని గండ్లూరు నివాసి అనారోగ్య కారణంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
KRNL: ఆలూరులోని శ్రీ శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి భక్తులు ఉదారంగా ఇవాళ విరాళాలు అందజేస్తున్నారు. మాజీ మంత్రి మారెప్ప అల్లుడు చినబాబు అజయ్ రూ.50,000, జోల్దరాసి నానీ మురళి కృష్ణ రూ.20,000 విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
ATP: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో జిల్లాలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. యుద్ధ ప్రాంతాల్లో చిక్కుకున్న జిల్లా వాసుల సమాచారం కోసం బంధువులు 8500292992 నంబర్ను సంప్రదించవచ్చు. ఆర్డీవో కార్యాలయాల నంబర్లు 9493188818 (అనంతపురం), 8309598111 (కళ్యాణదుర్గం), 9866646648 (గుంతకల్లు) సహాయం పొందవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ATP: కనగానపల్లి మండలం నెమళివరం, పాతపాళ్యం గ్రామాల్లో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదివారం పర్యటించారు. గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్లను పరిశీలించి, కొత్త రోడ్డు మార్గాల అవసరాలపై గ్రామస్థులు, టీడీపీ నాయకులతో చర్చించారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లతో సమావేశమై మీ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆమె హామీ ఇచ్చారు.
KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ రేషన్ దుకాణాల్లో భారీ అవినీతి జరుగుతోందని YCP మాజీ MLA రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఆదివారం స్థానిక YCP కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ గోడౌన్ నుంచే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు అమ్ముకుంటున్నారని తెలిపారు. రేషన్ కార్డుదారులకు ప్రతినెల అరకిలో చక్కెర మినహా ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేయలేదన్నారు.
ప్రకాశం జిల్లా ఇంటెలిజెన్స్ విభాగంలో ఆర్ఐవో జోనల్ సీఐగా పని చేస్తున్న శ్రీరాం కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈయన జిల్లాలోని పొదిలి, దర్శి, కందుకూరు ప్రాంతాల్లో సీఐగా పనిచేశారు. రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన పలు కేసులను ఆయన పరిష్కరించారు. దీంతో సీఐ శ్రీరామ్ ప్రతిష్టాత్మమైన కేంద్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు.