KDP: లింగాల మండలంలో దేవాలయ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పులివెందుల ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.వి.రమణ వెల్లడించారు. ఇందులో భాగంగా కోమన్న, తల,పెద్దకూడాల, పార్నపల్లె, ఇప్పట్ల, వెలిదండ్ల, తాతిరెడ్డిపల్లె, లోపట్నూతల గ్రామాల్లో దేవాలయ భూములను కొందరు ఆక్రమించినట్లు గుర్తించామని, ఈ మేరకు MROకు పూర్తి వివరాలతో వినతి పత్రాన్ని అందించామన్నారు.