ATP: గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండ గ్రామంలో నూతన సనంకరమ్మ దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమం శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి హాజరయ్యారు.
SKLM: కోటబొమ్మాళి మండలం పట్టుపురంలో శనివారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేశారు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అర్హత గల ప్రతి ఒక్కరికి త్వరలో పింఛన్లు అందజేస్తామని తెలియజేశారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రజలు వినియోగించుకోవాలన్నారు.
సత్యసాయి: పరిగి మండలం స్థానిక చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. శనివారం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని చెరువు నుంచి బయటకు తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు, ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఇతర కారణాలున్నాయా అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
AKP: కోటవురట్ల మండలం రాజుపేట ఎంపీయూపీ స్కూల్లో శనివారం జాతీయ సైన్స్ డే దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా MEO రామారావు మాట్లాడుతూ.. విద్యార్థులు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపించాలన్నారు. సైన్స్తో ఎంతో అభివృద్ధి సాధించవచ్చునన్నారు. అగ్రికల్చర్ ఫార్మింగ్, నీటి పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు.
KDP: బద్వేల్ నియోజకవర్గంలోని చెరువుల పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం నీటిపారుదల శాఖ అధికారులతో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బొజ్జ రోశన్న సమీక్ష నిర్వహించారు. రైతుల నుంచి వచ్చిన పలు అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలపై చర్చించారు. చెరువులను పరిశీలించి మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు.
BPT: పిల్లలువారిపాలెంలో అభయ ఆంజనేయ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ నేత శివప్రసాద్ చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించారు. అనంతరం స్వామి వారికి జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రేపల్లె నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కొలసాని రాము పాల్గొన్నారు.
E.G: నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామం చెందిన తిరుమలశెట్టి లక్ష్మీ మంగతాయారు గుండె సంబంధిత వ్యాధి చికిత్స కోసం LOC రూ.4.50 లక్షల మంత్రి కందుల దుర్గేశ్ అందజేశారు. ఆమె చికిత్సకు పెద్ద మొత్తంలో డబ్బు జనసేన మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నంను బాధిత కుటుంబ సభ్యులు కలవగా వారు ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో LOC మంజూరు అయ్యింది.
CTR: గుడిపాల పలు గ్రామాల్లో అడవి ఏనుగుల సంచారాన్ని అరికట్టేందుకు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు 4 కుంకీ ఏనుగులను రప్పించారు. ఈ ఏనుగులకు ఎమ్మెల్యే తండ్రి గురజాల చెన్నకేశవులు నాయుడు స్థానిక అటవీశాఖా సిబ్బందితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ చర్యతో పంట నష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని స్థానిక రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కోనసీమ: ప్రజల సుఖసంతోషాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. శనివారం మండపేట పట్టణంలో పలువురు లబ్దిదారుల ఇంటికి వెళ్ళి ఫించన్లు పంపిణీ చేశారు. అదే విధంగా 12వ వార్డులో కర్ణం సత్యవతి, 17వ వార్డులో నాయుడు భద్రమ్మలకు కొత్తగా మంజూరైన స్పౌస్ ఫించన్లను ఆయన పంపిణీ చేశారు.
NTR: ఏ. కొండూరు తండా రైతులు మేజర్ కాలువ చివరి వరకు నీళ్లు అందించాలని డిమాండ్ చేస్తూ కాలువలోకి దిగి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కౌలు రైతు సంఘం నాయకుడు జెట్టి వెంకటేశ్వరావు మాట్లాడుతూ.. కాలువ కింద వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, వరి, మిర్చి, కూరగాయల పంటలు సాగులో ఉన్నాయని, వెంటనే నీళ్లు విడుదల చేసి చివరి వరకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
W.G: నరసాపురం (M) ఎల్బిచర్ల బీఆర్ అంబేద్కర్ గురుకులంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో మార్చి 1న పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎన్. శ్యాంప్రసాద్ తెలిపారు. గురుకుల పాఠశాలలో ఆదివారం ఈ ప్రవేశ పరీక్షలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఎటువంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ప్రకాశం: కనిగిరి మండలం పేరంగుడిపల్లి రోడ్డులో నిర్మాణంలో ఉన్న గురుకుల పాఠశాల భవన పనులను కనిగిరి శాసన సభ్యులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి శనివారం పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులతో సమీక్షించి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోపు నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అనంతపురం రూరల్ మండలం ఉప్పరపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ శనివారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే స్వయంగా వెళ్లి పింఛన్ సొమ్మును అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధులు, వికలాంగులతో కలెక్టర్ ముచ్చటించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
VZM: విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని వేపాడ ఎంఈవో పీ బాల భాస్కరరావు కోరారు. దబ్బిరాజుపేట ఎంపీపీ పాఠశాలలో శనివారం జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు తయారుచేసిన పలు ప్రాజెక్టులను పరిశీలించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
NLR: కోవూరు నియోజకవర్గంలో 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నల్లపరెడ్డి కుటుంబం మంచి పేరు సంపాదించుకుందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విజయం ఖాయమని YCP జిల్లా అధ్యక్షులు కాకాణి పేర్కొన్నారు. నెల్లూరు డీఎస్పీ కార్యాలయంలో విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రసన్నకుమార్ రెడ్డి వద్ద డబ్బు సంచులు లేకపోయినా, కాని జన బలం ఉందన్నారు.