NDL: శ్రీశైల దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పాలన ప్రజలకు అనుకూలంగా ఉంటుందని తెలిపారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, దేశం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు ఆనందంగా జీవిస్తారని పేర్కొన్నారు. గోవులు అధికంగా పాలు ఇస్తాయని, దేశంలో గ్రహణాలు కనిపించవని వెల్లడించారు.