NLR: ఆంధ్ర ప్రాంత సముద్ర జలాలలో చొరబడి చేపల వేట సాగించే తమిళ జాలర్ల అక్రమాలకు శాశ్వతంగా చెక్ పెట్టాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. జువ్వలదిన్నె ఘటనపై నెలకొన్న అపోహలు తొలగించి ప్రభుత్వం అండగా ఉందన్న సందేశాన్ని చేరవేసి మత్స్యకారులలో ఆత్మస్థైర్యాన్ని నింపాలన్నారు.