అన్నమయ్య: బ్రాహ్మణ అర్చక పురోహిత సమైక్య ఆధ్వర్యంలో ఆదివారం రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో విలీనం చేయాలని కోరుతూ నిరాహార దీక్ష చేపట్టారు. పట్టణంలోని టోల్గేట్ సమీపంలోని గాంధీ విగ్రహం ముందు రైల్వే కోడూర్ నియోజకవర్గ బ్రాహ్మణ కమిటీ సభ్యులు ఈ దీక్షలో పాల్గొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ దీక్ష కొనసాగింది.