BDK: జిల్లా ప్రజలకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఆదివారం పలు సూచనలు జారీ చేశారు. జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి ప్రజలు సుదూర ప్రాంతాల నుండి రేపు ప్రజావాణికి వస్తున్నందున,వారి సౌకర్యార్థం డివిజన్ల వారీగా ప్రజావాణి నిర్వహణకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. భద్రాచలం డివిజన్ పరిధిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.