అనంతపురం జిల్లా మడకశిర మండల పరిధిలోని జిల్లెడగుంట గ్రామంలో జరిగిన ఆంజనేయ స్వామి రథోత్సవంలో MLA రాజు పాల్గొన్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోలాహలం మధ్య శ్రీ ఆంజనేయ స్వామి రథాన్ని దేవాలయం నుంచి లాగారు. అంజన్న స్వామి అంటూ నామస్మరణతో గ్రామం అంత మార్మోగింది. సీఐలు రామయ్య, రాజకుమార్ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు.