KDP: డ్రగ్స్ రహిత సమాజమే మన లక్ష్యమని, సమష్టి కృషితో డ్రగ్స్ను పారదోలుదామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ఈగల్'(ఎలైట్ యాంటి నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్) ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించే పోస్టర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు.