SKLM: కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలోనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలులో దాదాపు 70% హామీలను అమలు చేశామని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని అన్నారు. ఓర్వలేని వైసీపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.