TG: రాష్ట్రంలో పలువురు IPS అధికారులు బదిలీ అయ్యారు. రాష్ట్ర పోలీస్ అకాడమీ డైరెక్టర్గా అభిలాష బిష్ట్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్గా శిఖా గోయల్, CID అడిషనల్ DGగా చారూసిన్హా, చార్మినార్ జోన్ DIGగా తప్సీర్ ఇక్బాల్, హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ DCPగా చైతన్య కుమార్, ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా కాంతిలాల్, మెదక్ జిల్లా ఎస్పీగా శ్రీనివాసరావు నియమితులయ్యారు.