KRNL: ప్రజాభాగస్వామ్యం, వివిధ శాఖల సమన్వయంతో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరింపజేయాలని జిల్లా వ్యవసాయాధికారిణి పీఎల్ వరలక్ష్మీ తెలిపారు. బుధవారం జిల్లా వ్యవసాయశాఖ సమావేశ మందిరంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఏపీ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ (ఏపీసీఎన్ఎఫ్)పై లోతైన అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ శిక్షణ నిర్వహించినట్లు డీఏవో తెలిపారు.