KKD: ఈనెల 7న కాకినాడలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు రాత్రి నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు కలెక్టర్ షాన్మోహన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. కాకినాడలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి మెయిన్ రోడ్డులోని టైటాన్ షోరూం వరకు 216 జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి 8 నుంచి శనివారం ఉదయం 10 గంటల వరకు వాహనాల రాకపోకలు నిషేదించారు.