NLR: కందుకూరు పట్టణం కనిగిరి రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయం వెనుక అన్నప్రసాద భవనం నిర్మిస్తున్నారు. అయితే ఈ భవనానికి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు రూ.2.5 లక్షల విలువైన 2500 చదరపు అడుగుల గ్రానైట్ను ఇవ్వనున్నట్లు బుధవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఆయనకు సేవాసమితి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. స్థానిక ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.