బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుటుంబాన్ని చరిత్ర నుంచి కనుమరుగు చేసేలా యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దానిలో భాగంగా బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్కు ఉన్న ‘ఫాదర్ ఆఫ్ నేషన్’ బిరుదును తొలగించింది. ఈ మేరకు యూనస్ ప్రభుత్వం చట్ట సవరణ చేసింది. అలాగే, చట్టంలో ముజిబుర్ రహ్మాన్ పేరు ఉన్న భాగాలను తొలగించింది.