NLG: దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు ఉదయం 10:30 గంటలకు కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించనున్నారు. ఈ వేడుకకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కళ్యాణం అనంతరం భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.