ATP: పెద్దవడుగూరు మండల పరిధిలోని చిత్రచేడు గ్రామానికి చెందిన నందా, అరుణ దంపతుల కుమారుడు చరణ్ దీప్ (2) గురువారం నీటి తోట్టిలో పడి మరణించాడు. ఇంటి ఆవరణలోనే ఆడుకుంటున్న బాలుడు అక్కడే ఉన్న నీటి తొట్టిలో పడిపోయాడు. తల్లిదండ్రులు ఇది గమనించకపోవడంతో బాలుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.