NLG: భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని డిప్యూటీ తాసీల్దార్ ఫ్రాంక్లిన్ ఆల్బట్ అన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా గురువారం కట్టంగూర్ మండలంలోని పందనపల్లి, ఇస్మాయిల్పల్లి గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. డీటీ మాట్లాడుతూ.. గ్రామాల్లో నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు వినియోగించుకోవాలన్నారు.