SRPT: విద్యుత్ ఘాతంతో యువకుడికి గాయాలైన సంఘటన, హుజూర్నగర్ పట్టణంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం తన ఇంట్లో ఉన్న చెట్టుకు మునగ కాయలు కోస్తున్న క్రమంలో, ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి విద్యుత్ ఘాతానికి గురయ్యాడు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.