ప్రకాశం: దేశవ్యాప్తంగా కుల గణన చేయాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల కనిగిరి బీసీ సంక్షేమ సంఘం నాయకులు నాయబ్ రసూల్ హర్షం వ్యక్తం చేశారు. కుల గణనపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా అయిన చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కేంద్ర కాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు అవుతాయన్నారు