KRNL: బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం వద్ద ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బుధవారం కర్నూలులో ఎంపీ మాట్లాడుతూ.. ఘటనలో 8 మంది మృతి చెందడం, 50 మందికిపైగా గాయపడటం దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.