CTR: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టి రేషన్ కార్డుదారులకు నిత్యవసరాలను పారదర్శకంగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ అన్నారు. మంగళవారం ఇరువారంలోని చౌక దుకాణాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేసి రేషన్ పంపిణీని పరిశీలించారు. కార్డుదారులకు ప్రభుత్వం నిర్దేశించిన రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలన్నారు.