GNTR: పేదవారి ఆరోగ్యాన్ని నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి సంజీవనిలాగా పనిచేస్తోందని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. మంగళవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో 55 మంది లబ్దిదారులకు రూ.70,71,253 /- లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.