కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు ఆర్సీఎం చర్చి వద్ద యేసు తిరు హృదయ మహోత్సవాలు శనివారంతో ముగిశాయి. మూడో రోజు ఏలూరు బిషప్ పొలిమేర జయరావు హాజరై యేసు ప్రేమ, క్షమ, దయ గుణాల ప్రాధాన్యత వివరించారు. ప్రత్యేక దివ్య బలి పూజ అనంతరం అన్నదానం నిర్వహించారు. ఫాదర్ గోళ్ళ విజయ్కుమార్ పర్యవేక్షణలో జరిగిన వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.