SKLM: ఆమదాలవలసలో వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త చింతాడ రవికుమార్ పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆదివారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన త్యాగాన్ని మన తెలుగుజాతి ఏనాటికీ మరచిపోదని అన్నారు. ఆ మహనీయుని స్ఫూర్తితో మనరాష్ట్ర అభ్యున్నతి కోసం అందరం పాటుపడాలని కోరారు.