GNTR: కొల్లిపర మండలం సిరిపురం గ్రామానికి చెందిన గోసే రాజారావు వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 4 లక్షల ఆర్థిక సహాయం మంజూరైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవతో ఈ సహాయం లభించింది. మంజూరైన నిధులకు సంబంధించిన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్)ను శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులకు నాదెండ్ల మనోహర్ అందజేశారు.