KRNL: నందవరం మండల టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న దేశాయి గురు రాజారావు టీడీపీ సభ్యత్వానికి మంగళవారం రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాలతో పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు మాజీ సర్పంచ్ రామన్న గౌడ్, ఖలీల్, శివ, డానియల్, అతని అనుచరులు సభ్యత్వానికి రాజీనామా పత్రాలను టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డికి పంపుతున్నట్లు తెలిపారు.