BPT: సాంకేతిక లోపంతో బాపట్ల రైల్వేస్టేషన్లో ఆదివారం రాత్రి రైలు నిలిచిపోయింది. రైల్వే అధికారులు కథనం మేరకు.. సికింద్రాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్ళే శబరి ఎక్స్ప్రెస్ ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలును లోకో పైలట్లు బాపట్ల రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించడంతో మరమ్మతులు చేశారు.