GNTR: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలని ఆలోచన చేస్తున్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వైసీపీ కోటి సంతకాల సేకరణకు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైసీపీ మంగళగిరి కార్యాలయంలో మంగళవారం ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతురావు, నియోజకవర్గ సమన్వయకర్త వేమారెడ్డి మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో 70వేల సంతకాల సేకరణ చేశామని తెలిపారు.