KRNL: మంగళగిరి టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటీ.నాయుడు పాల్గొన్నారు. మాజీ మంత్రి పీతల సుజాత, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. ఆయా అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని, సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.