GNTR: తెనాలి 36వ వార్డులో శుక్రవారం రాత్రి జరిగిన జనసేన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతి కార్యకర్త ఒక ఉద్యమంలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఒకరు సభ్యత్వం తీసుకుని రాబోవు రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.