W.G: పెనుమంట్ర మండల కేంద్రంలో బుధవారం గర్భిణులు, చంటిబిడ్డలకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. ఈ నేపథ్యంలో ఏఎన్ఎం భాగ్య కుమారి మాట్లాడుతూ.. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించకుండా క్రమం తప్పకుండా టీకాలు వేయించుకోవాలని గ్రామస్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు సంతోషి, నీరజ, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.